పిల్లలకు బిస్కెట్లకు బదులుగా…

పిల్లలు బిస్కెట్లు అధికంగా తీసుకుంటున్నారా? అయితే ప్రమాదం అంటున్నారు వైద్యులు. చిన్నారులు బిస్కెట్లు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టపడతారు. అలాంటిది బిస్కెట్లను రెండుకు మించి ఒకే సమయంలో ఎక్కువ తీసుకుంటే ఆకలి లేమి ఏర్పడుతుంది. తద్వారా ఇతర ఆహారాన్ని తీసుకోవడంలో పిల్లలు ఆసక్తి చూపరు.

క్రీమ్, సాల్ట్  బిస్కెట్లతో ఇంకా చాలా ప్రమాదకరం.

సాధారణ బిస్కెట్లతో పోల్చితే క్రీమ్ బిస్కెట్లు ఇంకా చాలా ప్రమాదకరం. క్రీమ్ బిస్కెట్లలో చేర్చే ఫ్లేవర్లు, రంగుల్లో పూర్తిగా రసాయనాలు వుంటాయి. అందులో రుచి కోసం సుక్రోస్ అధికంగా వుండటం, తెలుపు పంచదారను చేర్చడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ క్రీమ్ బిస్కెట్లు తీసుకోవడం ద్వారా వయో బేధం లేకుండా అందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి.ఉప్పు చేర్చే బిస్కెట్లలో సోడియం కార్బొనేట్ రక్తపోటును పెంచుతుంది. రోజూ క్రీమ్ బిస్కెట్లు, ఉప్పు చేర్చే బిస్కెట్లను తీసుకుంటే పిల్లల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.

ఇంకా బిస్కెట్లను మైదా పిండితో తయారు చేయడం ద్వారా, పిల్లల్లో మలబద్ధం పెరుగుతుంది. గ్లాసుడు పాలతో రెండు బిస్కెట్లను పిల్లలు తీసుకుంటే శరీరంలో అనవసరపు కొవ్వు చేరుతుంది. పిల్లలు చురుకుగా వుండరు. అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో షుగర్ ఫ్రీగా వుంటాయి. ఇందులో సుక్రోస్ లేకపోయినా. దానికి బదులు షుగర్ ఫ్రీ మాత్రలను, కార్న్ పిండి, షుగర్ సిరప్‌లను చేర్చుతారు. ఇవి శరీర మెటబాలిజం స్థాయిలను తగ్గిస్తాయి. కాలేయంలో సమస్యలను పెంచుతాయి.

అందుచేత పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని, ఇంట్లో తయారు చేసే చిరుతిండిని ఇవ్వడం మంచిది. పెరిగే పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడాన్ని తల్లిదండ్రులు అలవాటు చేయకపోవడం మంచిదని డాక్టర్లు సెలవిస్తున్నారు.