అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు: వేముల వినయ్ కుమార్

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ మధిర నియోజక వర్గ విద్యార్థి విభాగం నాయకులు వేముల వినయ్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మ నేర్పిన భాషను మర్చిపోవద్దు.. భావి తరాలకు చిన్ననాటి నుంచే తెలుగు భాషను దూరం చేసే ప్రయత్నాలను పాలకులు చేయవద్దు అని వేముల వినయ్ కుమార్ అన్నారు. జన్మనిచ్చిన అమ్మను ఎలా మర్చిపోలేమో.. అలాగే అమ్మ నేర్పిన భాషను కూడా మర్చిపోకూడదని మాతృభాషా దినోత్సవం సందర్భంగా అయన పిలుపునిచ్చారు. చాలా మంది ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్ పరీక్షలను మాతృ భాషలోనే వ్రాసి విజయం సాధిస్తున్నారని గుర్తు చేశారు. మాతృభాషతో ఉద్యోగాలు పొందలేమని అనుకోవడం భ్రమేనని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుపున, విధ్యార్థివిభాగం తరుపున తెలుగు ప్రజల అందరికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేశారు.