కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన”

అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా శ్రీనివాస నగర్, ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్డు, ఫోర్త్ రోడ్, పాపంపేట ప్రాంతాల్లో తిరిగి క్రియాశీలక సభ్యులను కలిసి “నా సేన కోసం నా వంతు” కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, మెరుగు శ్రీనివాస్, భవాని నగర్ మంజునాథ్, హితేంద్ర చౌదరి, ప్రవీణ్ కుమార్, అమర్నాథ్ రాయల్, వెంకటాద్రి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.