Pithapuram: శ్రీమతి మాకినీడి శేషుకుమారికి క్రిస్మస్ సదస్సకు ఆహ్వానం

పిఠాపురం పార్టీ కార్యాలయంలో ఉప్పాడ కొత్తపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థన చేసి దీవెనలు అందించారు. తదనంతరం డిసెంబర్ నెల 6వ తారీఖున జరగబోయే సేవకుల క్రిస్మస్ సదస్సకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ జోసఫ్ తొంమండ్ర మరియు సెక్రటరి అలెక్స్ డి మేథ్యూస్ కార్యకర్తలు ఫెలోషిప్ బోర్డు మెంబెర్స్, మత్స్యకార నాయకులు వంక కొండబాబు, మెరుగు ఇశ్రాయేలు, మైలపిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.