పాయకరావుపేటలో జనసేన జెండా ఎగరడం ఖాయం
- జనసేన పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి అంగూరి లక్ష్మీ శివకుమారి
పాయకరావుపేట: కోటవుట్ల మండలం, కొడవటిపూడి గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ గెడ్డం బుజ్జి సూచన మేరకు “జనసేన పరిచయ వేదిక” కార్యక్రమంలో బాలేపల్లి ఏసుబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి అంగూరి లక్ష్మీ శివకుమారి కొడవటిపూడి గ్రామనికి విచ్చేశారు. జనసైనికులు ఉద్దేశించి శివకుమారి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త పార్టీ కోసం అహర్నిశలు కష్టపడాలి. పార్టీ సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకొని గ్రామంలో జనసేన పార్టీని మరింత బలపడే విధంగా కృషి చేయాలి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాకు తెలియపరచవలెను. నేను మీకు అండగా ఉంటాను ఇదేవిధంగా కష్టపడితే పాయకరావుపేటలో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది జనసేన పార్టీ కార్యకర్తల, వీరమహిళలు పాల్గొన్నారు. వాళ్లందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బగుడు శ్రీను, కట్టుమూరి హరిబాబు, లోకవరపు అప్పారావు, ఆర్. నాగేశ్వరావు, బి.రమణ, బి. బాబ్జి, జె. గోవిందు, బోండ కృష్ణ, పినపాత్రుని దుర్గాప్రసాద్, ఉగ్గిన రాము మరియు జనసేన పార్టీ కార్యకర్తలు వీరమహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-14-at-10.09.05-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-14-at-10.09.04-PM-1024x576.jpeg)