డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాసినట్లే

నూజివీడు, చాట్రాయి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడులను మరియు రెక్కీలను నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ ఖండించారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాయని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తాయని, రాష్ట్రంలో భయాందోళనక వాతావరణం ఏర్పడుతుందని తెలియజేశారు.