రైతు రాజు అవ్వాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యం – దుర్గారావు మందపాటి

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంట నష్టం వలన చనిపోయిన కౌలురైతు కుటుంభాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున 80 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం చూస్తే రైతుల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందొ రైతుల గురించి పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అభిమానాన్ని అర్ధం చేసుకోవలసిన అవసరం ప్రజలకు ఉంది. ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి రైతులను మోసం చేయడం తప్ప ఇప్పటి వరకు మిర్చి పంట వలన నష్టపోయి కష్టాల్లో ఉన్న ఎంత మంది రైతులకి నష్ట పరిహారం చెల్లించిందో ప్రజలకి తెలియ చేయాలని జనసేనపార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల పార్టీ అని చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రాష్టంలో ఇన్ని కౌలురైతుల ఆత్మ హత్యలు జరుగుతున్న ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ప్రజలు అర్ధంచేసుకోవాలి. త్వరలో పవన్ కళ్యాణ్ రాష్టంలో పర్యటించి నష్టపోయిన రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయాన్ని తానే స్వయంగా అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మేము తెలియచేసేది ఒక్కటే రాబోయే రోజుల్లో(2024) పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ అధికారం చేపట్టి రాష్టంలో రైతు ప్రభుత్వం స్థాపించి తీరుతుంది. రైతుని రాజుగా జనసేనపార్టీ నిలపెడుతుందని ప్రజలందరికీ ముక్తకంఠంతో తెలియచేసుకుంటున్నామని దుర్గారావు మందపాటి అన్నారు.