పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యత

సిద్ధవటం, రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మరియు పరిణామాలు ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందనిపిస్తుంది. ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం సన్నగిల్లుతుంది. పవన్ కళ్యాణ్ ప్రాణం ఆయనకు ముఖ్యమో కాదో తెలియదు కానీ, మనలాంటి కోట్లాది మంది అట్టడుగు పేద, బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యము. మన రాష్ట్రానికి ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం యొక్క జెడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరియు కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షాని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిద్ధవటం మండలం ఇన్ఛార్జ్ కొట్టే రాజేష్, జనసేన పార్టీ 12వ వార్డు మెంబర్ రాజా సుహేల్, కళ్యాణ్ సుబ్బయ్య 11వ వార్డు మెంబర్ పసుపులేటి కళ్యాణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *