పంట భీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేసిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం అనాతవరం బోగాలతోట గ్రామంలో మిచౌగ్ తుఫాన్ కారణంగా కురిసిన కుంభవర్షాలకు పంట నష్టపోయిన బొక్కా నాగరాజు, బొక్కా వెంకటరాజు పంట పొలాలను పరిశీలించారు. రైతులకు వెంటనే పంట నష్టపరిహారం 20 నుండి 25 వేలు ఇప్పించాలని, పంట భీమా వర్తించేలా చూడాలని 75 కేజీలు 1637 రూపాయలు సాధారణ రకం, ఏ గ్రేడ్ 1652 రూపాయలు బేషసరతుగా కొనుగోలు చెయ్యాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. అలాగే మురుగు కాలువలకు పూడికలు వెంటనే తీయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.