జమ్మలమడుగులోని సమస్యలను భవాని దృష్టికి తీసుకెళ్లిన గురు సురేష్

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గురు సురేష్ రాష్ట్ర నాయకులైన భవాని దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నాయకులు కె భవాని తాడపత్రికి రావడంతో ఈ సందర్భంగా.. జనసేన గురు సురేష్ తాడపత్రికి వెళ్లి భవానితో చర్చించి.. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా జమ్మలమడుగులో అభివృద్ధి లేదు అలాగే జమ్మలమడుగులో ఉన్న మండలాలకు అభివృద్ధి లేదు.. వద్దిరాలలో నీటి సమస్య, రోడ్డు సమస్య, కాలుష్యం సమస్య లను తెలియజేసి.. వైసీపీ నాయకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని భవాని దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.