”ప్రజల పక్షాన జనసేన” మ్యాగజైన్ ను ఆవిష్కరించిన చిత్తూరు జనసేన నాయకులు

తిరుపతి, జనస్వరం న్యూస్ టీం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా రూపొందించిన మ్యాగజైన్ ను చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జనస్వరం టీం వారు రూపొందించిన మ్యాగజైన్ చాలా బాగుందని ప్రశంసించడం జరిగింది. జనసేన పార్టీ చేస్తున్న విస్కృత కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సామాన్యులకు అర్థం అయ్యేలా చక్కగా వివరించడం జరిగిందన్నారు. జనస్వరం న్యూస్ మరింత ఎత్తుకు ఎదుగుతూ పార్టీ అభివృద్ధి కోసం శ్రమించాలని కోరడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలను, కార్యక్రమాలను వెబ్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్న విషయం తెలిసిందే అదేవిధంగా జనస్వరం వారి వీక్లీ పేపర్ కూడా ప్రజలలో ప్రజాదారణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, జనసేన నాయకులు పగడాల మురళి, బాటసారి పాల్గొన్నారు.