జనం అంటే జగన్ కు భయం

*జగన్ అప్పట్లో ముద్దులు, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు

*శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభించేందుకు సీఎం ఎందుకు రాలేదు, ఏడుకొండల వెంకన్న పై జగన్ కు మమకారం లేదా

*రాబోయే రోజుల్లో వైకాపా కనుమరుగు కాయం

*అందుకే గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయాడు

*జనసేన పార్టీ విమర్శ ఆరోపణలు

విద్యా దీవెన తో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై తిరుపతి కి విచ్చేసిన.. సీఎం జగన్ సాగిస్తున్న.. (వైసీపీ దోపిడీ పాలన) పై ప్రజలకు భయపడి.. (రోడ్డు మార్గాన్ని) వదిలి, గాలిలో నేరుగా ఫ్లైట్, హెలికాప్టర్ లతో సీఎం సభాస్థలికి చేరుకోవడం.. మహిళా పొదుపు సంఘాలను, ఇంటర్ విద్యార్థులను సభకు హాజరు కావాలని ఆంక్షలు విధించి… బ్లాక్మెయిల్ చేయడం అత్యంత హేయమైన చర్య గా.. జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు.. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా మధ్య జనసేన నాయకులు రాజారెడ్డి, మధుబాబు, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, హేమ కుమార్, ముక్కు సత్యవంతుడు, ఈశ్వర్ రాయల్, కృష్ణ, గోపి, లోకేష్, హరి నాయక్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. సాధారణంగా గతంలో సభకు వచ్చిన వారికి డబ్బులు పంచే వారు.. ఇప్పుడు సభకు రాకుంటే ఫైన్ వేస్తామని హుకుం జారీ చేయడం హాస్యాస్పదమన్నారు.. దీనికి నిదర్శనం.. సభను వదిలి గోడదూకి పారిపోయేలా కాపలా కాచిన, వాలంటీర్లే సాక్ష్యం అన్నారు.. 10 పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకేజీ.. వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు.. ఇందులో డీబార్ అయిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉండటం.. వైకాపా ప్రభుత్వం పాలన.. ( యధా రాజా తథా ప్రజా) అన్నట్లుగా ఉందని జగన్ పాలనపై, వ్యంగ్యాస్త్రాలు విసిరారు.. దీనికన్నా సీఎం కార్యాలయం నుంచే ఆన్లైన్లో ప్రారంభోత్సవ సభ కార్యక్రమాలు ముగించి.. ఉంటే భారీ ఖర్చు మిగిలి ఉండేది అని విమర్శించారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-05-06-at-1.56.49-PM-1024x682.jpeg