జగన్ కి ముద్రగడ అనే మరో కొత్త పాలేరు దొరికాడు : పోలిశెట్టి

మైలవరం: ముద్రగడ లేఖ పై జనసేన ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి తేజ స్పందించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ అనే ఆర్థిక నేరగాడికి, రౌడీకి ముద్రగడ వత్తాసు పలుకుతూ లేఖ విడుదల చేయడం దుర్మార్గం అని ముద్రగడ వైసీపీకి అమ్ముడు పోయారని 2019 నుండి కాపు ఉద్యమాన్ని ఎందుకు కొనసాగించలేదని ధ్వజమెత్తారు. కాపు సంఘం ముసుగులో ఉంటూ ముఖ్యమంత్రి జగన్ కోసం వైసిపి పార్టీ కోసం, ద్వారంపూడి కోసం పని చేశారని, కాపు సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వానికి ఒక్క లేఖ అయినా రాయలేదని, వైసిపి నాయకులు అన్ని వర్గాల ప్రజల్ని బూతులు తిడుతుంటే ముద్రగడ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ ని తిడితే సహించేదిలేదని పోలిశెట్టి తేజ హెచ్చరించారు.