డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని కార్పొరేటర్ తో పోల్చడం జగన్ అవివేకం: సామంచి శ్రీనివాస్

బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గురువారం తిరుపతి ప్రస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అసలేమైందని, ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు అందరిని మోసం చేసి ప్యాలెస్ కు పరిమితమై పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న తానేం చేశారో గుర్తు చేసుకోవాలాన్నారు. తనను వీడి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను బ్రతిమాలుతున్న జగన్.. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని కార్పొరేటర్ తో పోల్చడం అవివేకం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి సర్పంచులకు నిధులు ఇచ్చి, విధులు ఇచ్చి ఆదర్శ రాజకీయ నేతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పొనగంటి భాస్కర్, వరప్రసాద్, నవీన్ కూమార్ రెడ్డి, డాక్టర్ శ్రీహరిరావు, దీపక్ యాదవ్, నవీన్ రాయల్, ప్రసాద్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment