ముస్లిం మైనార్టీలకు అపద్దపు హామీలను చెప్పి నిలువునా మోసగించిన జగన్ రెడ్డి: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 39వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 18వ డివిజన్ గుల్జారీ పేట నందు మహిళలతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక మహిళలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అపద్దపు హామీలను ఇచ్చి మోసగించాడని. ఒక్క ఛాన్స్ అంటూ ముస్లింలపై ప్రత్యేక అభిమానం ఉన్నట్లు నటించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేశారని ముస్లింల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుల్హన్ పథకంతో మొదలుకొని రంజాన్ తోఫా, విదేశీ విద్య, తత్కాల్, దుకాణ్ మకాన్, ఇస్లామిక్ బ్యాంకు పథకాలకు వైసీపీ మంగళం పాడిందని ఇమామ్ మౌజాన్లకు అందజేసే గౌరవ వేతనం 15వేల రూపాయలు గృహాల మంజూరు మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని, ప్రతి నియోజకవర్గానికి షాదీ ఖానా హామీ మరిచారని హాజ్ యాత్రకు ఆర్థిక సహాయం కరువైందని ముస్లింలకు సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయని చెప్పిన పథకాలు ఏమి అమలు చేయక జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతూ ముస్లింలను మోసం చేశాడని అంటూ ఈసారి కచ్చితంగా ముస్లిం మైనారిటీలు జనసేన-టీడీపీ పార్టీలకు ఓటు వేయాలని తప్పకుండా మీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, టీడీపీ 18వ వార్డు ఇంచార్జీ ముస్తఖాన్, వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.