ముస్లిం మైనార్టీలను నిలువునా మోసగించిన జగన్ రెడ్డి

  • ముస్లిం మైనార్టీలకు అపద్దపు హామీలనుచెప్పి నిలువునా మోసగించిన జగన్ రెడ్డి
  • ముస్లిం మైనార్టీల అభివృద్ధికి జనసేన టీడీపీ పార్టీలు కట్టుబడి ఉన్నాయి
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం రూరల్: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత గురువారం మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 14వ రోజు అనంతపురం రూరల్ మండలంలోని చంద్రబాబు నగర్ లో మహిళలతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక ముస్లిం మతపెద్ద మహబూబ్ ఖాన్ ఆహ్వానం మేరకు మాబుసుబాని దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం లకు జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసాల గురించి మాట్లాడారు అపద్దపు హామీలు ఇచ్చి మోసగించాడని ఒక్క ఛాన్స్ అంటూ ముస్లింలపై ప్రత్యేక అభిమానం ఉన్నట్లు నటించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేశారని ముస్లింల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వ అమలు చేసిన పథకాలన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుల్హన్ పథకంతో మొదలుకొని రంజాన్ తోఫా, విదేశీ విద్య, తత్కాల్, దుకాణ్ మకాన్, ఇస్లామిక్ బ్యాంకు పథకాలకు వైసీపీ మంగళం పాడిందని ఇమామ్ మౌజాన్లకు అందజేసే గౌరవ వేతనం 15వేల రూపాయలు గృహాల మంజూరు మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని, ప్రతి నియోజకవర్గానికి షాదీ ఖానా హామీ మరిచారని హాజ్ యాత్రకు ఆర్థిక సహాయం కరువైందని ముస్లింలకు సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయని చెప్పిన పథకాలు ఏమి అమలు చేయక జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతూ ముస్లింలను మోసం చేశాడని అంటూ.. ఈసారి కచ్చితంగా ముస్లిం మైనారిటీలు జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేయాలని తప్పకుండా మీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి స్థానిక డివిజన్ నాయకులు చాంద్, మన్సూర్ ,గౌస్ మొహిద్దిన్, వీర మహిళలు లక్ష్మి, చంద్రకళ, సరోజమ్మ, గాయత్రి, సురేఖ, సానియా తదితరులు పాల్గొనడం జరిగింది.