జగన్ రెడ్డి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించు బ్రోకర్ లా కాదు

  • జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పితాని మాట్లాడుతూ జగన్ రెడ్డి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించు బ్రోకర్ లా కాదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి పదవి పోతుందనే అభద్రతాభావంతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. దమ్ము, దైర్యం ఉంటే అమలాపురం వస్తున్నావుగా వాలంటీర్లును అడ్డంపెట్టుకుని సేకరించిన డేటాను ఏంచేస్తున్నావు సమాధానం చెప్పు.. ప్రజలను తప్పుదారి పట్టించడం మాని.. విధ్వంసం తప్ప అభివృద్ధి చేయడం తెలియని నీవు నీ వెనకున్న ఇద్దరు ముగ్గురుకు తప్ప రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసావు. అమలాపురం వస్తున్నావని ఎప్పటినుండో ఉన్న పచ్చని చెట్లు తొలగించేస్తున్నారు. నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడంతా సర్వనాశనం. ఆరోపణలపై సరైన సమాధానం చెప్పకుండా నీచంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.