పాలకొండలో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్
పాలకొండ నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ #FailureOfJaganannaColony జగనన్న కాలనీల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ కి పిలుపునివ్వడం జరిగింది. అధ్యక్షులు వారి పిలుపుమేరకు శనివారం జగన్మోహన్ రెడ్డి పాలకొండ నియోజకవర్గం లుంబూరులో సుమారు 1100మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు వాటిని చూస్తుంటే చాలా దారుణంగా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. చెరువులను తలదన్నేలా ఉన్న ఈ కాలనీలో పేదల పక్కా గృహాలు ఎలా నిర్మించుకుంటారు దేనికి ఉపయోగం కనీసం నడవడానికి కూడా వీలులేని వరద ప్రాంతాలా ఉన్న స్థలాల్లో జగనన్న కాలనీలు ఇవ్వడమనేది చాలా దారుణం జగన్ రెడ్డి విశాలమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్న భవనాల్లో నివసిస్తాడు కానీ ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలను హీనంగా పశువులుగానే ఈయన చూస్తున్నాడు అనేదానికి ఇదే నిదర్శనం. చుట్టూ నీరుతో నిండి ఉన్న స్థలాలను చూపిస్తూ ప్రజలను నడి సముద్రంలోకి నెట్టి ఏమీ చేయలేని స్థితిలో పడేశారు. నీట మునిగిన స్థలాల్లో ఇల్లు ఎలా నిర్మిస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గొర్ల మన్మధరావు శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం కమిటీ నెంబర్స్ ప్రశాంత్ పోరెడ్డీ, రమేష్ పొట్నురు, జనసైనికులు హరికృష్ణ అనిల్ గుణ గణేష్ ప్రేమ్ రాజేష్ ప్రసాద్ అనిల్ సతీష్ వేణు ఉమా లోకేష్ గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-13.09.07-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-13.09.10-1024x576.jpeg)