పెనుకొండ జనసేన ఆద్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

  • శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం లోని మూడవ రోజు జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం.

పెనుకొండ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు. జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షులు యు గంగాధర ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు మరియు జగనన్న మోసం ప్లకార్డ్స్ తో సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను గురించి ఎం ఆర్ ఓ ఆఫీసు కి వెళ్ళి అధికారులతో పరిశీలించి.. వాటిని అతి త్వరలో పరిష్కరించాలని విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.