శింగనమల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం.. జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

శింగనమల నియోజకవర్గం: ప్రభుత్వం వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టి అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నార్పల మండల కేంద్రంలో జగనన్న ఇల్లు పేద ప్రజలకు కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వారు మండల కేంద్రంలోని జగనన్న కాలనీలను సందర్శించి జగనన్న మోసం అనే ప్లకార్డ్ లను చేతబట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా కళ్లిబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. నవరత్నాల్లో భాగమైన జగనన్న ఇల్లు పథకాన్ని కేవలం ప్రచారం కోసం మాత్రమే వాడుతున్నారని క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉందని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి లక్ష ఇల్లు నిర్మించి పేదలకు అందిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒక్క ఇల్లు కూడా పూర్తీ చేయలేదని ఆరోపించారు. శనివారం నార్పల మండల కేంద్రంలోని జగనన్న కాలనీలు సందర్శించామని అందులో పిచ్చి మొక్కలు, కంపచెట్లు దర్శనిమిస్తున్నాయే తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క ఇటుక పేర్చినట్లు ఆనవాలు లేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టి పేద ప్రజలకు పంచాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుపాకుల భాస్కర్, ప్రదీప్, రామయ్య, గిరీష్, కళ్యాణ్, నాగేష్, విజయ్, బాబా, రాము తదితరులు పాల్గొన్నారు.