కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు

#jaganannaMosam అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో… జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా అనంతపురం నగర సమీపాన ఆలమూరు గ్రామం దగ్గర జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది.

జగనన్న కాలనీలో లబ్ధిదారులకు… 5315 గృహాలు మంజూరు చేశారు ఇంతవరకు కనీసం ఒక గృహం కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు. కేవలం 300 నుంచి 400 గృహాలకు మాత్రమే పునాదులు వేసి వదిలేసారు కొన్ని గృహాల గోడల నిర్మాణ దశలో వదిలేశారు.

జగనన్న నిరుపేదలకు మీరు ఇస్తున్న ఇల్లు ఇంకా ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేసి ఇస్తారు? స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్, వెంకటాద్రి నాయక్, దుర్గాప్రసాద్, నారా నాయక్, రవి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.