జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఎమ్మిగనూరు జనసేన

ఎమ్మిగనూరు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్, ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నందు విలేకరు సమావేశాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్, కరణం రవి, బజారి, మాట్లాడుతూ జనసేన అధినేత పిలుపు మేరకు ఈనెల 12, 13, 14 తేదీల్లో చేపట్టనున్న జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న కాలనీలో పర్యటించి సమస్యల్ని అధికారుల దృష్టి తీసుకుపోయే విధంగా కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ నరేష్ రాజు ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.