కాకినాడ జనసేన ఆధ్వర్యంలో జగనన్న పాపాలు కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక 33వ డివిజన్ అల్లూరి సీతారామరాజు విగ్రహం సమీపంనందు మరియు 40వ డివిజన్ అధ్యక్షులు అడబాల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వద్ద జగనన్న పాపాలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాకా ధరలు పెంచడంలో ఉన్న శ్రద్ద పాలనలో చూపించలేదనీ, ఎక్కడ చూసినా అరాచకం, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజల ధన, మాన, ఆస్థులకు రక్షణ లేకుండా పోయిందని భయాందోళనలతో బ్రతకాల్సి వస్తోందన్నారు. ఈ అయిదు ఏళ్ళలో ఒక్క నిర్మాణాత్మకమైన పని జరిగింది ఏదన్నా ఉందా అని ప్రశ్నించారు. బతుకు భారమైపోయిందని మధ్యతరగతి వర్గాలు తమ సర్వేలో వాపోతున్నారని తెలిపారు. ఇంక ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని భరించే ఓపిక మాకు లేదని దండం పెడుతున్నారన్నారు. ఈప్రాంతాలలో జనసేనపార్టీ శ్రేణులు పర్యటిస్తూ రాబోయే ఎన్నికలలో జనసేనపార్టీ తెలుగుదేశంలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి ఉపాధయక్షుడు అడబాల సత్యన్నారాయణ, సిటి కార్యదర్శులు ఉదయభాస్కర్, ముత్యాల దుర్గాప్రసాద్, సమీర్, రవిశంకర్, నాయకులు శ్రీమన్నారాయణ, దారపు సతీష్, కష్మీర్, నక్కల సతీష్, అగ్రహారపు సతీష్, వంశీ, పి. మధు, అడబాల రాజేంద్ర, అడబాల బాబ్జీ, కొనగళ్ల పరశురాముడు,మేళం త్రినాథ్, సాపిరెడ్డి భాస్కర రావు, వాసిరెడ్డి సుబ్బారావు, వాసిరెడ్డి సత్య కుమార్, వారణాసి రాము, సుంకర సురేష్, మనోహర్లాల్ గుప్తా, నకిలే సతీష్, సాధనాల గంగాధర్(రమేష్), బ్రహ్మజీ, మిరియాల హైమవతి, సుజాత, మరియా, లీల, దీప్తి తదితరులు పాల్గొన్నారు.