సింగనమల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా, జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాల మేరకు సింగనమల నియోజవర్గం సింగనమల మండలం లోని కల్లుమడి, తరిమెల గ్రామాలలో జనసేన నాయకులు జగనన్న కాలనీ సందర్శించి ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టడం జరిగింది. అక్కడ పరిస్థితి చూస్తే ముళ్ళ పొదల జగనన్న కాలనీ అనిపిస్తోంది మరి అక్కడ మనుషులు నివసించడానికి ఇచ్చారో లేక ఎందుకు ఇచ్చారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని జనసేన నాయకులు నిలదీసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి, సింగనమల మండలం కన్వీనర్ తోట ఓబులేసు, బిందెల సాయి శంకర్, శేషు, రాము, మల్లేష్, మధు, మాధవ, తోట రామ్మోహన్, గజేంద్ర నాయక్, నరసింహ, గంగాధర్, తోట మధు, సంతోష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-12-at-7.09.46-PM-1024x385.jpeg)