జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవ రోజు పవన్ కళ్యాణ్ పరిశీలించే ప్రాంతం యొక్క లేఅవుట్ ప్లాన్ ను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మరియు పార్టీ స్టేట్ సెక్రెటరీ శివదత్ బోడపాటి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 99% ఇళ్ళ స్థలాలు ఖాళీగా ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కట్టిన ఆ 1% కూడా లబ్ధిదారులు సొంత నిధులతో కట్టుకోవడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.