ఎన్ని రాజు ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

రాజాం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పేదలు ఇల్లు జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా రాజాం నియోజకవర్గ, రేగిడిఆమదాలవలస మండలం, ఉంగరడ మెట్ట వద్ద మౌలిక వసతులు లేని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు పట్టాలిచ్చి నిర్మాణం చేయాలని చేతకాని ప్రభుత్వానికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఇకనైనా పేదల గృహాలు ప్రభుత్వమే కట్టించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తూ. 3వ రోజు కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.