అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జగనన్న కాలనీల పరిస్థితిపై, జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వణుకూరులోని జగనన్న కాలనీల వాస్తవ పరిస్థితులు, జగనన్న కాలనీలోనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు పడుతున్న బాధలు స్వయంగా చూసి వారిని అడిగి తెలుసుకున్న అమ్మిశెట్టి వాసు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీమతి పోతిరెడ్డి అనిత, కంకిపాడు మండల ప్రెసిడెంట్ ముప్ప రాజా, తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు దోమకొండ అశోక్, యడ్లపల్లి శివ నాగరాజు, పోతిరెడ్డి రమణ, రామాయణపు కోటి, వి.హరి ప్రసాద్, పాశం సుజాత, మట్టా వివేక్, ఇనగంటి ప్రదీప్, పెళ్లూరి ఉమామహేశ్వరరావు మరియు తూర్పు నియోజకవర్గ నాయకులు, పెనమలూరు నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.