టెక్కలి జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

టెక్కలి : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రెండవ రోజు జగనన్నఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు #jaganannaMosam కార్యక్రమంలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలోని కిస్టుపురం పంచాయతీలో ప్రభుత్వం అందజేసిన జగనన్న ఇళ్ల స్థలాలను కాకర్ల కొండ దగ్గర జనసేన పార్టీ టెక్కలి నియజకవర్గం నాయకులు మేడిబోయిన.సుధీర్, పల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28 లక్షల ఇళ్లను మంజూరు చేశామని చెబుతున్నా ఇప్పటివరకు 10 శాతం ఇళ్లను పూర్తిచేయలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదు, కానీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు పేపర్లో ప్రకటనలు చేయడం సిగ్గు చేటు.. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్నట్టు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో, టెక్కలి నాయకులు సంతోష్, వినోద్, రమేష్, చందు ప్రసాద్, జనార్దన్, శ్రీను, ఉదయ్, పవన్, జనసైనికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.