జగన్ చేసిన 100 మోసాల కరపత్రాలు పంపిణీ చేసిన కీర్తన

రాజంపేట : వీరపల్లి మండలం, సానిపాయ గ్రామం నందు ఓ ప్రజలారా తెలుసుకోండి జగన్ చేసిన 100 మోసాలు అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. వాటిని కరపత్రాలుగా ముద్రించి ప్రజలకి వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసిన స్థానికులు గుగ్గిళ్ళ నాగార్జున, వార్డ్ మెంబర్ గుగ్గిళ్ళ వెంకటేష్, నేతి వెంకటేష్, బొగడ వెంకటయ్య, రెడ్డి చెర్ల శివ శంకర్, శ్రీనాథ్, శివ కళ్యాణ్, హరి తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.