కరోనాను జయించిన జక్కన్న

రాజమౌళి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కరోనావైరస్ పాజిటివ్ సోకిన అనంతరం రాజమౌళి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా 2 వారాల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న రాజమౌళి.. తమ కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నామని, అందరికీ ఈ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది అని రాజమౌళి తెలిపాడు. రాజమౌళి ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

కరోనాతో కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. కరోనాతో బాధపడే వారికి ఇంజెక్ట్ చేసి బతికించుకునే అవకాశం ఉండటంతో తాము కూడా ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఐతే శరీరంలో యాండీబాడీలు వృద్ధి చెందాయో లేదో తెలియాలంటే ఇప్పటి నుంచి మరో మూడు వారాల పాటు వేచిచూడాల్సిందేనని డాక్టర్లు తెలిపారని రాజమౌళి ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు.