భీమ్ నగర్లో దళితవాడలో జనచైతన్యం

పిఠాపురం, ప్రభంజనంగా సాగుతున్న దళిత చైతన్యం కార్యక్రమంలో జనసేన సిద్ధాంతాలను ఉధృతంగా ప్రచారం చేస్తున్న వాకపల్లి సూర్యప్రకాష్. కులమత వర్గ వర్ణాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానుల్లో దళిత సోదరులు అగ్రఘన్యులు. నిస్వార్ధమైన వారి ప్రేమాభిమానాలు ఓట్లకు మాత్రమే పరిమితం కాకుండా జనసేన గెలుపులో వారి నాయకత్వ భాగస్వామ్యాన్ని కూడా కోరుతూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష ఆధ్వర్యంలో నిర్వహింపబడి ఎఫ్.కె పాలెం జనసేన నాయకులైన దాసం పట్టాభి, గోన శ్రీను, రామిరెడ్డి సూర్య చంద్రుడు(చిన్న) పెడిరెడ్ల చిట్టిబాయ్ ల సమక్షంలో కొనసాగి స్థానిక భీమ్ యువత సహకారంతో విజయవంతమైంది. కార్యక్రమానికి ముందుగా మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనమైన నివాళులు తెలిపిన తధనంతరం స్థానిక క్రీడాకారులతో వాలీబాల్ కిట్ అందించిన వాకపల్లి సూర్య ప్రకాష్ పవన్ కళ్యాణ్ అభిమానులైన స్థానిక దళిత యువతతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పోలినాటి వీరబాబు, నూకతట్ల రామకృష్ణ, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ దొరబాబు, శీలం రమేష్, బల్ల రాజేష్, బల్ల లక్ష్మణ్, పలివెల నానీబాబు, దారా ఆదిరాజు, పోలినటి దుర్గారావు, నిర్మల్ కుమార్, ఎన్.సత్యాకిరణ్, దార ప్రవీణ్ కుమార్, ముక్కు వెంకటేష్, మచ్చా బద్రి, తదితర దళిత యువతతో ఏర్పాటైన ఈ సమావేశంలో కందరాడ ఎంపీటీసీ పిల్లా వెంకట దినేష్ గారు, మడగల రామకృష్ణ, బారుకుల కృష్ణ, మేక గణేష్, మేక నరేంద్ర, పేకెటి ఏసు, సందక గోవింద్, మండల నాయకులు తాటికాయల ప్రసాద్, మోటూరి మహేష్, రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్ మరియు గంజి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.