ఉప్పాడలో బాధిత కుటుంబానికి జనసైనికుల సాయం

ఉప్పాడ గ్రామంలో వర్షం కారణంగా కూలిపోయిన పేరూరి రమణ పెంకుటిల్లు విషయమై స్పందించిన జనసేన నేత గంటా విజయ్ కుమార్, ఘటన స్థలానికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించి ఆహార ధాన్యం (రైస్ బ్యాగ్) అందజేశారు. నూకాలమ్మ గుడి పక్కన జరిగిన ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి సమస్యకూ తోచిన సాయం చేయడం జనసేన ధ్యేయం,” అని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం బాధితులకు తగిన సాయం అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సహాయక కార్యక్రమంలో సూరాడ నాగేశ్వరరావు, సూరాడ కృష్ణ, గంటా సింహాద్రి తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment