2వ రోజు గ్రామ ప్రజల నీటి కొరత తీర్చిన జనసైనికులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలోని చినపలకలూరు గ్రామంలో ఆర్చీ బజారులో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చి ఇంటి వద్దకు నీళ్లు అందించడం జరిగింది. మా గ్రామ అభివృద్ధి మరియు సేవ చేయడమే మా లక్ష్యం, మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాకు ఆదర్శం అని మాట్లాడిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, మండల కార్యదర్శి గణితి ధనసాయి కుమార్, గ్రామ అధ్యక్షులు తుమ్మల ఏడుకొండలు, గ్రామ జనసేన నాయకులు తుమ్మల సురేష్ కుమార్, పాలపాటి శేఖర్, ఇనిమెళ్ళ నాగభూషణం తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment