ప్రధాని సభకు తరలి వెళ్లిన జనసైనికులు

వేమూరు(భట్టిప్రోలు): రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వేమూరు మండలం నుండి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరవుతు అనురాధ ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి వాహనాలలో రాజధాని తరలి వెళ్లారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పునఃప్రారంభం మరియు ప్రధాని నరేంద్ర మోడి పర్యటనకు జిల్లా జనసేన నాయకుల ఆదేశాల మేర వేమూరు మండలంలోని కుచ్చెర్లపాడు వెళ్ళబాడు వరాహపురం కాకర్లమూడి చదలవాడ తదితర గ్రామాల నుండి భారీ జన సందోహం పలు వాహనాలలో భారీగా తరలివెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తాడికొండ కోటేశ్వరరావు, గూ డపాటి పద్దయ్య, పెరికల రవి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment