కొత్తవలసలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎస్.కోట, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త, ఉత్తరాంధ్ర జోన్ ఎన్నికల కమిటీ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్తవలస మండలంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడికవర్ సిబ్బంది ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్ లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుండె, ఇతర వైద్య పరీక్షలు చేశారు. కేకు కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ అందించే బాధ్యతను ఆయన తీసుకున్నారన్నారు. ఆయన కోసం, ఆయన బాటలో నిరంతరం నడుస్తామని పేర్కొన్నారు. అనంతరం కొత్తవలస మండలంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లా రామదుర్గ, కురికూరి రాజు, గాలి అప్పారావు, రామదాసు కాశీ, పవర్ శ్రీను, మల్లువలస శ్రీను, ఆనంద్, సత్తిబాబు, వరహాలు, తోట శ్రీను, సింగంపల్లి ఎర్రినిబాబు, కరాటే లక్ష్మణరావు, బంధం సత్తిబాబు, జనసైనికులు పాల్గొన్నారు.