విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కుమ్మరిపాలెం సెంటర్లో 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, సిటీ జాయింట్ సెక్రటరీ గన్ను శంకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరై, జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్చి 14వ తేదీన జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి, స్థానికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రంజిత్ కుమార్ పార్టీ ఆవిర్భావ సభ కోసం రూ. 25,000 విరాళాన్ని సామినేని ఉదయభాను గారికి అందించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి కాదు, మహా శక్తి అని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు మహదేవపు అప్పాజీ, మరుపిల్ల రాజేష్, అత్తులూరి పెద్దబాబు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, కో-కన్వీనర్ కె.ఎస్.ఎన్ మూర్తి, కృష్ణ పెన్న రీజియన్ కోఆర్డినేటర్ మల్లెప్పు విజయలక్ష్మి, స్టాలిన్ శంకర్, తిరుపతి అనూష, రేలంగి బుజ్జి, ధారా బాబు, ఈగె భరత్, డివిజన్ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment