కావలి పట్టణం 38వ వార్డులో జనంకోసం జనసేన

కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అళహరి సుధాకర్, కావలి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సమన్ను వెంకట సుబ్బయ్య మరియు పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి కావలి పట్టణ 38వ వార్డు ఇంచార్జీ మన్నేపల్లి రిషికేశ్ ఆధ్వర్యంలో ఆదివారం కావలి పట్టణం 38వ వార్డులో జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణములో ప్రతీ వార్డుకు ఇంటి ఇంటికీ వెళ్ళే కార్యక్రమములో భాగంగా 32వ వార్డ్ లో ఘనంగా నిర్వహించిన తరువాత ఆదివారం 38వ వార్దు వైకుంఠపురంలో పతీ ఇంటికి వెళ్ళి పాంప్లేట్స్ ఇచ్చి జనసేన గాజుగ్లాసు గుర్తుకు కావలిలో ఓటువేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేసుకుందాము అని విస్తృత ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ “ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన ఉందని, రెండు పార్టీలు మాకు ఒరగబెట్టింది ఏమీలేదు ఈసారి తప్పక జనసేన పార్టీ గాజు గ్లాసుకే ఓటు వేస్తామని చెప్పడం జరిగింది” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.