సమస్యల చెంతకు జనసేన

ఖమ్మం నియోజకవర్గం ప్రకాష్ నగర్ డివిజన్ లో సమస్యలను తెలుసుకోవడానికి జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల, స్థానిక నాయకులు గుండబోయిన నరేష్, దేవరపల్లి దుర్గ ప్రసాద్, సంతోష్, శ్రీకాంత్, శ్రవణ్, అజారుద్దీన్ మరియు జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. సమస్యల నిలయంగా ప్రకాష్ నగర్ డివిజన్ ఉంది. చాలా సమస్యలతో ప్రకాష్ నగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మణం గత 3 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. వాటి కోసం తీసిన పెద్ద పెద్ద గోతుల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. వీధి కుక్కల సమస్య, దోమల సమస్య, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యల మీద జనసేన పార్టీ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తుంది లేని పక్షంలో ప్రజలు తరుపున పోరాడుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండ్ల పవన్ కళ్యాణ్, మహేష్ పెంటల, రాకేష్, చంటి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.