రామగుండం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం మండల ఉపాధ్యక్షుడు మోతె రవికాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మంథని శ్రావణ్ జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంథని శ్రావణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీ తెలంగాణలో పార్టీ స్థాపించి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడి గొంతుగా మారి యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మండల ఉపాధ్యక్షుడు మోతె రవికాంత్, చెట్టి రాజశేఖర్, షంషీర్, జూల నవీన్, మనోజ్, రామచందర్, నరేష్, నజీర్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment