హైదరాబాద్ – కూకట్పల్లి: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ సౌజన్యంతో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, “జనసేన పార్టీ ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తోంది. పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడతాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కొల్లా శంకర్, సత్యసాయి, అడబాల షణ్ముఖ, బలిజేపల్లి శంకర్రావు, పులగం సుబ్బు, మూసాపేట్ డివిజన్ జనసేన నాయకులు సుదర్శన్, వెంకటస్వామి, కిరణ్ రెడ్డి,అంజిబాబు, తిరుపతిరావు, సంతోష్, కుమార్, లక్ష్మీనారాయణ, రఘు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. కూకట్పల్లి జనసేన నాయకులు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Share this content:
Post Comment