రాజోలు: మార్చి 14వ తేదీన పిఠాపురం – చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి మామిడికుదురు మండలం (7 గ్రామాలు) గోగన్నమఠం గ్రామంలో మరియు రాజోలు మండల కేంద్రంలో మండల స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్, ఆవిర్భావ సభ నియోజకవర్గ పరిశీలకులు, మాల కార్పొరేషన్ స్టేట్ ఛైర్మన్ పెదపూడి విజయ కుమార్.ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. అత్యధిక సంఖ్యలో గ్రామాల నుంచి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. బస్సు సదుపాయం, భోజన ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియజేశారు. పెదపూడి విజయ కుమార్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో రాజోలు నియోజకవర్గంకి ప్రత్యేక స్థానం ఉందని, దీనిని మరింత బలపరిచేలా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. జనసేన నేతలు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆవిర్భావ సభను చారిత్రాత్మకంగా చేయాలన్న ఉత్సాహంతో కార్యకర్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

Share this content:
Post Comment