అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం, నార్పల, మండల, జనసేన పార్టీ నాయకులు 12వ ఆవిర్భావ దినోత్సవ గోడపత్రికలను సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ సాకే మురళి, జిల్లాకమిటీ సభ్యుల ఆద్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా జనసేన పార్టీ వేదికగా ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని ఈసారి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉత్సవం చేసుకుందామన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులలో కొత్త ఉత్సాహం ఉర్రూతలూగుతోందన్నారు. ఆవిర్భావము నుండి అభివృద్ధి వరకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని వేడుక చేసుకోవాలని సూచించారు. మునుపెన్నడూ చూడని విధంగా మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సభగా ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని, ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగే ఆవిర్భావ సభకు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు పురుషోత్తం రెడ్డి మరియు కృష్ణమూర్తి, నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, ఉపాధ్యక్షులు దాడి తోట శివయ్య, నాయకులు అశ్వత్ రెడ్డి, వినోదం నారాయణస్వామి, సాకే రాజు, శ్రీధర్ బాబు, కుల్లాయప్ప, వినోదం లోకేష్, నాగరాజు యం . కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment