తుని టౌన్, నెహ్రు నగర్ లో ఇంటింటా జనసేన

తుని నియోజకవర్గం: తుని టౌన్ నందు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా 3వ వారం కార్యక్రమాన్ని తుని టౌన్ 1వవార్డు నెహ్రు నగర్ లో నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా వార్డులో సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కరపత్రాలు పంచుతూ ప్రజలకు వివరిస్తూ ముందుకి సాగింది. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి బాలాజి, యు. సీతారామరాజు, రాము, ఎం. శివ,చ్ఆనంద్, రమణ, ఉదయ్, ప్రసాద్, వీరబాబు తుని మండల అధ్యక్షులు ధారకొండ రమణ, కోటనందూరు అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, వంగళపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు, నాగబాబు, రాంబాబు, నాగేశ్వరావు శేషు రాము, ప్రసాద్, తాతారావు తదితరులు పాల్గొని విజవంతం చేశారు.