మచిలీపట్టణంలో జనసేన భారీ ర్యాలీ

మచిలీపట్నం, కాలే ఖాన్ పేట నాంచారమ్మ తల్లి గుడి దగ్గర నుండి జనసేన పార్టీ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జనసేన పార్టీ మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ జనసేన నాయకులు కొరియర్ శ్రీను, కొట్టే వెంకటరావు మరియు వాలిశెట్టి మల్లి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఆదివారం మచిలీపట్నం వైసిపి సీనియర్ నాయకులు మాదివాడ రాము మరియు వైసిపి 30వ వార్డు కార్పొరేటర్ కోసూరు నాంచారయ్య మరికొంతమంది అనుచరులు వైసిపి నుండి జనసేన పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.