ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించడం ఖాయం – బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో జరిగిన “జనం కోసం జనసేన” “మహాపాదయాత్ర” 44వ రోజులో భాగంగా జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాంల ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్ర గ్రామంలో ప్రతిఇంటికి తిరుగుతూ, ప్రతి ఒక్కరినీ ఈసారి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ… ఈ అసమర్ధ పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వం నుండి రాష్ట్రాన్ని రక్షించాలని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజాపాలన తీసుకురావాలని, ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించడం కాయడం ఖాయమని అన్నారు, గ్రామంలో మహిళలు పెద్దఎత్తున హారతులు పడుతూ, జనసెన శ్రేణుల ఉత్సాహం మధ్య ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా ముందుకు సాగింది. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, నిడిగట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.