జనసేన జనచైతన్య యాత్ర.. భారీ బైక్ ర్యాలీ

ఎల్బీనగర్ నియోజకవర్గం: ఎల్బీనగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ సాయి శిరీష పొన్నూరు ఆధ్వర్యంలో, శుక్రవారం వనస్థలిపురం డివిజన్లో జనచైతన్య యాత్ర విజయవంతంగా జరిగిన విషయం అందరికీ విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మూడవ రోజు బైక్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సాయి శిరీష ధన్యవాదాలు తెలుపుతూ.. ముందు ముందు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మనం చేయబోయే కార్యక్రమాలకు అందరూ కూడా ఉత్సాహంగా రావాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు.