జనసేన జన జాగృతి యాత్ర.. 13వ రోజు
గ్రామ గ్రామనా జనసేన ప్రభంజనం నల్లగొండ గడ్డా జనసేన అడ్డాగా మారింది. గ్రామ గ్రామనా తేనిటీ విందు కార్యక్రమం…
రాజానగరం నియోజకవర్గం, నల్లగొండ, జన జాగృతి యాత్ర కార్యక్రమానికి ప్రజలా ఆదరణతో ముందుకు సాగుతుంది, రాజానగరంనియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో అయన అదేశలు మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి కీలక పాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ సమక్షంలో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ కాతా సత్యనారాయణ, విరామహిళ కందికట్ల అరుణ కుమారి రాజానగరం మండలం కన్వీనర్ బత్తిన వెంకన్న దొర,చిడిపి నాగేష్, దుబాయ్ శ్రీను, గేదాల సత్తిబాబు, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు, కోలా ప్రసాద్ ముక్క రాంబాబు, భానుశంకర్, చదువు రాంబాబు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ …
జనసేన పార్టీ గుర్తు అయినా గ్లాజు గ్లాసుతో తేనిటీ ఇవ్వడం జరిగింది దానికి ప్రజలందరూ సహకరించి.. ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, నల్లగొండ గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వీర మహిళలు, నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.