రాజవరం గ్రామంలో జనసేన జన జాగృతి యాత్ర..
- జనసేన జన జాగృతి యాత్ర.. ఇంటింటికీ గాజు గ్లాసు, షణ్ముఖ వ్యూహం
రాజానగరం: కోరుకొండ మండలం, రాజవరం గ్రామంలో జనసేన జన జాగృతి యాత్రలో భాగంగా ఇంటింటికి జనసేన గాజు గ్లాసు మరియు షణ్ముఖ వ్యూహం కరపత్రాలు జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను వివరించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో 28రోజులు పాటు జరుగుతున్న ఈ జనసేన జనజాగృతి యాత్ర కు విశేష స్పందన లభిస్తుంది. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న మేడ గురుదత్త ప్రసాద్ అహర్నిశలు జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తల సహకారంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన గురుదత్ ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మేడ గురుదత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి నిరంకుశ విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలంతా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని, పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయనే నమ్మకంతో ఉన్నారని, ఆ విషయం ఈ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతుంటే స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-26-at-9.30.40-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-26-at-9.30.40-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-26-at-9.30.40-PM-2.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-26-at-9.30.41-PM.jpeg)