గోమతి నగర్ లో జనసేన జనవాణి

నెల్లూరు గోమతి నగర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు, కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఈ.ఈ వెంకటేశ్వర్లు, సుధామాధవ్, వెంకట్ తాల్లూరి, ఆఫీస్ ఇంచార్జి జమీర్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment