రోజాకి జనసేన నేత కిరణ్ రాయల్ కానుక

  • రోజా అవినీతి చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయగలదా
  • ఆరు నెలల తర్వాత వైసిపీ ప్యాకప్, జగన్ లాక్ అప్, రోజాకు ఓన్లీ మేకప్
  • నెక్స్ట్ రోజా కి చిలక జోస్యమే ఉపాధి
  • జనసేన కిరణ్ రాయల్ చెప్పిన భవిష్యత్

తిరుపతి: ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేనలను విమర్శించడంలో ముందుండే రాష్ట్ర మంత్రి రోజా అవ్వ కుటుంబం ఆస్తులు, అవినీతితో సంపాదించలేదని కాణిపాకం ఆలయంలో రోజా ప్రమాణం చేయగలదా అని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాజారెడ్డి, ఆకేపాటీ సుభాషిణిలు సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు కొండా రాజమోహన్, హేమ కుమార్, రాజేష్ ఆచారి, వంశీ, కిషోర్, దుర్గ, చందన తదితరులతో కలిసి జోస్యం కు సంబంధించిన వస్తువులను మీడియా ముందు ప్రదర్శించి, వైసీపీ నేతల భవిష్యత్తు చెప్పారు. రోజాకు భవిష్యత్తులో చిలక జోస్యమే గతి అని హెచ్చరిస్తూ హాస్య భరితమైన చురకలు విసిరారు. టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ పాలకులు పెట్టిన అక్రమ కేసులు, తద్వారా జైలుకు పంపిన వ్యవహారంపై మంత్రి రోజా బాణాసంచాలు పేల్చి స్వీట్లు పంచడంను తప్పు పట్టారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు మాట్లాడితే రాబోయే ఆరు నెలల తరువాత వైసీపీ ప్యాకప్, జగన్మోహన్ రెడ్డి లాకప్, రోజాకు మేకప్ అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.